కృష్ణజింకల వేట కేసులో తుదివిచారణకు హాజరైన సల్మాన్‌


కృష్ణ జింకల వేట కేసులో తుదివాదనలకు.. రాజస్థాన్‌లోని కోర్టు ముందు ప్రముఖ హిందీ సినీనటుడు సల్మాన్‌ఖాన్‌ గురువారం హాజరయ్యారు. 1998 అక్టోబర్‌ 2న జోధ్‌పుర్‌ జిల్లాలోని కంకనీ గ్రామంలో రెండు కృష్ణ జింకలను వేటాడినట్లు సల్మాన్‌ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ కేసుకు సంబంధించి జోధ్‌పుర్‌లోని ట్రయల్‌ కోర్టులో సెప్టెంబర్‌ 13న తుదివాదనలు మొదలయ్యాయి. కోర్టులో సల్మాన్‌ కాస్త ఇబ్బందిపడ్డట్లు కనపడ్డారని కొందరు న్యాయవాదులు తెలిపారు. కేసులో ఓ సాక్షి వాంగ్మూలం వీడియో రికార్డింగ్‌కు.. విచారణ అధికారి నమోదు చేసుకున్న వాంగ్మూలానికి మధ్య వైరుధ్యాలు ఉన్నట్లు సల్మాన్‌ తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. సాక్షుల వాంగ్మూలాలు, జింకల మృతదేహాలకు నిర్వహించిన పరీక్షలు వేట జరిగినట్లు తేటతెల్లం చేస్తున్నాయని ప్రొసిక్యూషన్‌ పేర్కొంది.

Movie Reviews

'యుద్ధం శరణం' మూవీ రివ్యూ
'యుద్ధం శరణం' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
ఆనందో బ్ర‌హ్మ
ఆనందో బ్ర‌హ్మ
పూర్తి వివరాలు
భానుమతి భయపెడుతుందా..?
భానుమతి భయపెడుతుందా..?
పూర్తి వివరాలు
'ఆనందో బ్రహ్మ' మూవీ రివ్యూ
'ఆనందో బ్రహ్మ' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
వారసులతో ప్రారంభం
వారసులతో ప్రారంభం
పూర్తి వివరాలు

Copyrights © 2016 Srikala Television
Developed By Srinivas

srinivas625.4u@gmail.com