రాఖీ సావంత్‌పై దావా వేసిన హనీప్రీత్‌ తల్లి


పంచకుల అల్లర్ల కేసులో డేరా అధినేత గుర్మీత్‌ సింగ్‌ దత్త పుత్రిక హనీప్రీత్‌ సింగ్‌ అరెస్టైన సంగతి తెలిసిందే. తాజాగా హనీప్రీత్‌ తల్లి ఆశా తనేజా బాలీవుడ్‌ నటి రాఖీ సావంత్‌పై దావా వేశారు. తన కుమార్తె గురించి తప్పుడు వ్యాఖ్యలు చేస్తోందన్న నేపథ్యంలో రాఖీకి నోటీసులు పంపినట్లు ఆశా మీడియా ద్వారా వెల్లడించారు.
నెల రోజుల్లో క్షమాపణ చెప్పాలని లేకపోతే రూ.5 కోట్లు జరిమానా చెల్లించాలని నోటీసులో పేర్కొన్నారు. గుర్మీత్‌, హనీప్రీత్‌ అరెస్టయినప్పుడు రాఖీ సావంత్‌ వీరి గురించి మీడియా ద్వారా మాట్లాడారు. తనకు గుర్మీత్‌ బాగా తెలుసని ఎప్పుడైనా ఆయన్ని కలవడానికి వెళ్తే ఎక్కడ గుర్మీత్‌కి దగ్గరవుతానోనన్న కారణంగా హనీప్రీత్‌ తనను రానిచ్చేది కాదని రాఖీ తెలిపింది. మరోపక్క గుర్మీత్‌ జీవితాధారంగా బాలీవుడ్‌లో ఓ బయోపిక్‌ రాబోతోంది. ఇందులో హనీప్రీత్‌ పాత్రలో రాఖీ సావంత్‌ నటిస్తోంది.
ఇద్దరు సాధ్వీలను అత్యాచారం చేసిన కేసులో 2017 ఆగస్ట్‌లో గుర్మీత్‌కు 20 ఏళ్ల కారాగార శిక్ష పడింది. గుర్మీత్‌ను అరెస్ట్‌ చేసిన అనంతరం హరియాణాలోని పంచకులలో అల్లర్లకు పాల్పడేలా ప్రేరేపించినందుకు హనీప్రీత్‌ను కూడా హరియాణా పోలీసులు అరెస్ట్‌ చేశారు.

Movie Reviews

'యుద్ధం శరణం' మూవీ రివ్యూ
'యుద్ధం శరణం' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
ఆనందో బ్ర‌హ్మ
ఆనందో బ్ర‌హ్మ
పూర్తి వివరాలు
భానుమతి భయపెడుతుందా..?
భానుమతి భయపెడుతుందా..?
పూర్తి వివరాలు
'ఆనందో బ్రహ్మ' మూవీ రివ్యూ
'ఆనందో బ్రహ్మ' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
వారసులతో ప్రారంభం
వారసులతో ప్రారంభం
పూర్తి వివరాలు

Copyrights © 2016 Srikala Television
Developed By Srinivas

srinivas625.4u@gmail.com