ఐటెల్‌ ఫోన్లపై ఎయిర్‌టెల్‌ ఆఫర్‌


వినియోగదారులను ఆకట్టుకునేందుకు టెలికాం సంస్థలు కొత్త కొత్త ఆఫర్లు తీసుకొస్తున్నాయి. మొన్నటిదాకా పోటాపోటీగా చౌకధరల్లో డేటా ఆఫర్లు ప్రకటించిన కంపెనీలు.. తాజాగా మొబైల్‌ తయారీ సంస్థలతో జట్టు కట్టి క్యాష్‌బ్యాక్‌లు అందిస్తున్నాయి. ఇప్పటికే ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్‌టెల్‌.. ఎంపిక చేసిన శామ్‌సంగ్‌ ఫోన్లపై ఈ ఆఫర్‌ అందిస్తుండగా.. తాజాగా చైనాకు చెందిన ఐటెల్‌ ఫోన్లకు కూడా ఆఫర్‌ను విస్తరించింది. ఐటెల్‌ రెండు ఫోన్లపై మూడేళ్ల కాలవ్యవధితో రూ.1500 క్యాష్‌ బ్యాక్‌ ప్రకటించింది.

‘ఐటెల్‌ ఏ40 4జీ, ఐటెల్‌ ఏ41 స్మార్ట్‌ఫోన్లపై రూ.1500 వరకు క్యాష్‌బ్యాక్‌ ఇస్తున్నాం. ఈ రెండు ఫోన్లకు రూ.169తో నెలవారీ రీఛార్జ్‌ ప్యాక్‌ వర్తిస్తుంది’ అని ఎయిర్‌టెల్‌ ఓ ప్రకటనలో తెలిపింది. ప్రస్తుతం ఐటెల్‌ ఏ40 ధర రూ.4,599, ఏ41 ధర రూ.4,699గా ఉంది. రూ. 169తో నెల నెలా రీఛార్జ్‌ చేసుకుంటే 36 నెలల తర్వాత రూ.1500 క్యాష్‌బ్యాక్‌ వస్తుంది.

18 నెలలు ముగిసేసరికి రూ.3000 విలువైన రీఛార్జ్‌లు చేసుకుంటే రూ. 500 తిరిగిస్తుంది. ఇక మిగతా 18 నెలలు మరో రూ.3000 సమానమైన రీఛార్జ్‌లు చేసుకుంటే రెండో విడతగా రూ.1000 నగదు వాపసు పొందుతారు అని ఎయిర్‌టెల్‌ తెలిపింది.

Movie Reviews

'యుద్ధం శరణం' మూవీ రివ్యూ
'యుద్ధం శరణం' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
ఆనందో బ్ర‌హ్మ
ఆనందో బ్ర‌హ్మ
పూర్తి వివరాలు
భానుమతి భయపెడుతుందా..?
భానుమతి భయపెడుతుందా..?
పూర్తి వివరాలు
'ఆనందో బ్రహ్మ' మూవీ రివ్యూ
'ఆనందో బ్రహ్మ' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
వారసులతో ప్రారంభం
వారసులతో ప్రారంభం
పూర్తి వివరాలు

Copyrights © 2016 Srikala Television
Developed By Srinivas

srinivas625.4u@gmail.com