ప్రకాశం జిల్లా జర్నలిస్టులకు న్యాయం చేస్తా---రేంజ్ డి.ఐ.జి.డాక్టర్ట్ త్రివిక్రమ వర్మ


ప్రకాశం జిల్లా జర్నలిస్టులకు న్యాయం చేస్తానని గుంటూరు రేంజ్ డి.ఐ.జి.డాక్టర్ట్ త్రివిక్రమ వర్మ గురువారం జర్నలిస్ట్ సంఘ ప్రతినిధులకు హామీ ఇచ్చారు.

ప్రకాశం జిల్లా సింగరాయకొండ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ ముఖద్వారం స్వామి అమ్మవారి విగ్రహాలు పాక్షికంగా దెబ్బతిన్న వార్తను ప్రచారం చేసినందుకు జర్నలిస్టులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలంటూ గుంటూరు రేంజ్ డిఐజి డాక్టర్ త్రివిక్రమ వర్మ ను ఏపియుడబ్ల్యూజె ప్రతినిధుల బృందం కలిసి జరిగిన ఘటనపై విచారించి జర్నలిస్టులపై కేసులు ఎత్తివేయాలని కోరడం జరిగింది డిఐజి మాట్లాడుతూ ఘటనపై ప్రకాశం జిల్లా యస్.పి. నుండి నివేదిక తీసుకుని తప్పనిసరిగా న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు త్వరలో జర్నలిస్టులతో జిల్లా వారీగా సమావేశం ఏర్పాటు చేసి అపోహలను తొలగించేందుకు ప్రయత్నం చేస్తామని చెప్పారు గుంటూరు రేంజ్ డి.ఐ.జిని రాష్ట్ర ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ అసోసియేషన్ కార్యదర్శి శివ ,గుంటూరు జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు కే సునీల్ సందీప్, రాష్ట్ర నాయకులు మార్కండేయులు, భాస్కర్ రెడ్డి పలువురు జర్నలిస్టులు ఉన్నారు

Movie Reviews

'యుద్ధం శరణం' మూవీ రివ్యూ
'యుద్ధం శరణం' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
ఆనందో బ్ర‌హ్మ
ఆనందో బ్ర‌హ్మ
పూర్తి వివరాలు
భానుమతి భయపెడుతుందా..?
భానుమతి భయపెడుతుందా..?
పూర్తి వివరాలు
'ఆనందో బ్రహ్మ' మూవీ రివ్యూ
'ఆనందో బ్రహ్మ' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
వారసులతో ప్రారంభం
వారసులతో ప్రారంభం
పూర్తి వివరాలు

Copyrights © 2016 Srikala Television
Developed By Srinivas

srinivas625.4u@gmail.com