వారసులతో ప్రారంభం


మహేశ్‌బాబు హీరోగా నటించనున్న 25వ సినిమా సోమవారం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, వైజయంతి మూవీస్‌ సంస్థలపై ‘దిల్‌’ రాజు, సి. అశ్వనీదత్‌ ఈ సినిమా నిర్మిస్తున్నారు. ముహూర్తపు సన్నివేశానికి మహేశ్‌ తనయుడు గౌతమ్‌ క్లాప్‌ ఇవ్వగా, తనయ సితార కెమెరా స్విచాన్‌ చేశారు. దేవుని పటాలపై చిత్రీకరించిన తొలి సన్నివేశానికి వంశీ పైడిపల్లి తనయ ఆద్య గౌరవ దర్శకత్వం వహించారు.

నిర్మాతలు శిరీష్, లక్ష్మణ్, అశ్వనీదత్‌ కుమార్తె స్వప్నాదత్, ‘దిల్‌’ రాజు కుమార్తె హన్షితారెడ్డి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. మహేశ్‌ సతీమణి నమ్రతా మహేశ్, నిర్మాతలు ‘జెమిని’ కిరణ్, నవీన్‌ ఎర్నేని, రవిశంకర్, సునీల్‌ నారంగ్, దర్శకులు సురేందర్‌రెడ్డి, హరీష్‌ శంకర్, సతీష్‌ వేగేశ్న, చిత్రసంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్‌ తదితరులు ఈ వేడుకలో పాల్గొన్నారు. ఈ చిత్రానికి కథ: వంశీ పైడిపల్లి–హరి–సాల్మన్, కెమెరా: పీయస్‌ వినోద్‌.

Movie Reviews

'యుద్ధం శరణం' మూవీ రివ్యూ
'యుద్ధం శరణం' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
ఆనందో బ్ర‌హ్మ
ఆనందో బ్ర‌హ్మ
పూర్తి వివరాలు
భానుమతి భయపెడుతుందా..?
భానుమతి భయపెడుతుందా..?
పూర్తి వివరాలు
'ఆనందో బ్రహ్మ' మూవీ రివ్యూ
'ఆనందో బ్రహ్మ' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
వారసులతో ప్రారంభం
వారసులతో ప్రారంభం
పూర్తి వివరాలు

Copyrights © 2016 Srikala Television
Developed By Srinivas

srinivas625.4u@gmail.com