నిన్న అర్జున్ రెడ్డి హీరోయిన్‌కి ఏమైంది? ఫుల్ స్టోరీ ఇదే!


నెల్లూరీయుల అభిమానం మరువలేనిది: సినీనటి షాలినీ పాండే
వేదికపైనే అస్వస్థత
అభిమానుల నిరాశ
నెల్లూరు: నెల్లూరీయుల అభిమానం మరువలేనిదని అర్జున్‌రెడ్డి సినిమా హీరోయిన్‌ షాలినీపాండే తెలిపారు. నెల్లూరులో బుధవారం సెల్‌ పాయింట్‌ మొబైల్‌ షోరూమ్‌లను ప్రారంభించేందుకు ఆమె వచ్చారు. తొలుత నగరంలోని ఆర్‌ఆర్‌ స్ట్రీట్‌లో గల షోరూమ్‌ను ప్రారంభించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి, వేదికపై ఎక్కి అభిమానులకు అభివాదం చేశారు. తదుపరి ఆమె మాట్లాడుతూ నెల్లూరు కేంద్రంలో అర్జున్‌రెడ్డి సినిమాకు మంచి టాక్‌ వచ్చిందన్నారు. నెల్లూరు ప్రేక్షక దేవుళ్లకు వందనాలని అన్నారు. నెల్లూరులో మిమ్మల్ని కలుసుకోవడం ఆనందంగా ఉందని, ఈ అవకాశాన్ని తనకు సెల్‌ పాయింట్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఎండీ మోహన్‌ ప్రసాద్‌ పాండే కల్పించారని పేర్కొన్నారు.

నెల్లూరులో తనకు ఇంత ఫ్యాన్స్‌ ఫాలోయింగ్‌ ఉందని మిమ్మల్ని చూస్తేనే అర్థమవుతుందని ఆమె తెలిపారు. స్మార్ట్‌ ఫోన్లు తక్కువ ధర నుంచి ఎక్కువ ధరల్లో కూడా ఉన్నాయని, ప్రతీ మొబైల్‌ కొనుగోలుపై విలువైన బహుమతులు అందచేస్తున్నామని సెల్‌ పాయింట్‌ ఎండీ పీ మోహన్‌ప్రసాద్‌ తెలిపారు. ఈ కార్యక్రమంలో హెన్రీ బూషన్‌డత్‌, పీ సత్యనారాయణ పాత్రుడు తదితరులు పాల్గొన్నారు.

కథానాయికకు అస్వస్థత
అర్జున్‌రెడ్డి కథానాయికి షాలినీ పాండే వేదికపై మాట్లాడుతూ తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో అర్ధాంతరంగా దిగిపో యారు. అప్పటివరకు ఈలలు, కేరింతలతో సంతోషాన్ని వ్యక్తం చేసిన అభిమానులు ఈ ఘటనతో ఆందోళనకు గురయ్యారు. అంతా ఒక్కసారిగా వేదిక వద్దకు దూసుకువచ్చారు. దీంతో అక్కడ తొక్కిసలాట జరిగింది. ఆమె వ్యక్తిగత సహాయకులు, సెక్యూరిటీ సిబ్బంది వైద్యం కోసం ఆమెను కిమ్స్‌(బొల్లినేని) సూపర్‌స్పెషాలిటీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం ఆమె తిరుగు ప్రయాణమయ్యారు.

Movie Reviews

'యుద్ధం శరణం' మూవీ రివ్యూ
'యుద్ధం శరణం' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
ఆనందో బ్ర‌హ్మ
ఆనందో బ్ర‌హ్మ
పూర్తి వివరాలు
భానుమతి భయపెడుతుందా..?
భానుమతి భయపెడుతుందా..?
పూర్తి వివరాలు
'ఆనందో బ్రహ్మ' మూవీ రివ్యూ
'ఆనందో బ్రహ్మ' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
వారసులతో ప్రారంభం
వారసులతో ప్రారంభం
పూర్తి వివరాలు

Copyrights © 2016 Srikala Television
Developed By Srinivas

srinivas625.4u@gmail.com